రామకృష్ణ కు పలువురి ప్రశంసలు
సదాశివపేట మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ విశ్వ బంధుత్వ దినోత్సవం సందర్బంగా బ్రహ్మకుమారీస్ సంగారెడ్డి ఏర్పాటు చేసిన రక్త దాన శిభిరం లో పాల్గొని తన 23వ సారి రక్తదానం చేసాడు.
రామకృష్ణ ఇప్పటి వరకు 23 సార్లు రక్తదానం చేయడం తో పాటు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ఉపాధ్యాయులు బోధనలోనే కాకుండా సమాజ సేవలో కూడా ముందు ఉంటారని నిరూపించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ...
"రక్తదానం మించిన దానం మరొకటి లేదు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. తాను ఇప్పటివరకు 23 సార్లు రక్తదానం చేశానని, రక్తదానం చేసిన ప్రతిసారీ ఒక కొత్త ప్రాణానికి సహాయం చేశానన్న తృప్తి కలుగుతుందన్నారు.
ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యా బోధనతో పాటు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, అందుకే విశ్వ బంధుత్వ దినోత్సవం రోజున బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.
ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలన్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఏ హాని లేదు, పైగా కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతాయన్నారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని అదేవిదంగా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు."
ఈ సందర్బంగా బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు రామకృష్ణను షీల్డ్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో అడ్వకెట్,మాజీ మండల విద్యాధికారి అంజయ్య,బికే అన్నపూర్ణ, బికే రాధిక,ఆదర్శ జిమాక్స్ కాలనీ అధ్యక్షులు యేసయ్య,బికే జగదీశ్వర్,బి కే రాజవర్ధన్ రెడ్డి,వైద్యులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రక్త దానం చేసిన రామకృష్ణ ను ప్రజా ప్రతినిధులు,మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ,పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు,తల్లి దండ్రులు మరియు విద్యార్థులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి