Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:28 PM

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.
25-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మొక్క నాటాలి.

రంగారెడ్డి, ఆగస్టు 25:

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ వినయ్‌కుమార్‌ ఐఎఫ్‌ఎస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా MJPTBCWREIS బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో భాగంగా MJPTBCWREIS ప్రాంగణంలో 2,200 మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.

మొక్కలు నాటడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని అన్నారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చార్మినార్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ డా. ప్రియాంక వర్గీస్‌ ఐఎఫ్‌ఎస్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కె.చంద్రారెడ్డి, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశీష్‌ సింగ్‌ ఐఎఫ్‌ఎస్‌, పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

నాటిన మొక్కలను సంరక్షించడం మరింత ముఖ్యం: పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌.

Article Image

ప్రతి విద్యార్థి పుట్టినరోజున మొక్క నాటాలి.

రంగారెడ్డి, ఆగస్టు 25:

వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ వినయ్‌కుమార్‌ ఐఎఫ్‌ఎస్‌ పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా MJPTBCWREIS బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో భాగంగా MJPTBCWREIS ప్రాంగణంలో 2,200 మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు.

మొక్కలు నాటడం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి విద్యార్థి పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం వాటిని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని అన్నారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చార్మినార్‌ సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ డా. ప్రియాంక వర్గీస్‌ ఐఎఫ్‌ఎస్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కె.చంద్రారెడ్డి, జిల్లా అటవీ అధికారి శివ్‌ ఆశీష్‌ సింగ్‌ ఐఎఫ్‌ఎస్‌, పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News