Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:29 PM

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి
25-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సురేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి, విద్యాభివృద్ధితోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడంతోపాటు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సిగరెట్, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.


కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జగదీష్, లైబ్రేరియన్‌ జానయ్య, అధ్యాపకులు ప్రసన్నదేవి, పున్నారావు, మాల వెంకటరెడ్డి, ముందడి వెంకటరెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, అశోక్‌కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రావణ్‌కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఐఈఓ సురేష్‌రెడ్డి

Article Image

రామన్నపేట

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సురేష్‌రెడ్డి సూచించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి, విద్యాభివృద్ధితోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడంతోపాటు ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సిగరెట్, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.


కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జగదీష్, లైబ్రేరియన్‌ జానయ్య, అధ్యాపకులు ప్రసన్నదేవి, పున్నారావు, మాల వెంకటరెడ్డి, ముందడి వెంకటరెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, అశోక్‌కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్‌రెడ్డి, ఉపేందర్‌రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రావణ్‌కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News