రామన్నపేట
విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి సురేష్రెడ్డి సూచించారు. మంగళవారం రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సురేష్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధి, విద్యాభివృద్ధితోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించడంతోపాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సిగరెట్, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జగదీష్, లైబ్రేరియన్ జానయ్య, అధ్యాపకులు ప్రసన్నదేవి, పున్నారావు, మాల వెంకటరెడ్డి, ముందడి వెంకటరెడ్డి, కిరణ్, నిర్మల, కవిత, నరసింహారావు, రాజేశ్వరి, అశోక్కుమార్, శ్రీకాంత్, నగేష్, అశోక్రెడ్డి, ఉపేందర్రావు, కరుణ, ఉమారాణి, పరశురాం, శ్రావణ్కుమార్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి