చిట్యాల: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికే కొందరు అధికారులు సమయపాలన పాటించకపోవడం విమర్శలకు తావిస్తోంది. సోమవారం చిట్యాల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడంతో సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించాల్సిన అధికారులు సమయానికి అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికే అధికారులు ఆలస్యంగా వస్తే.. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రజావాణి వంటి కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుండగా, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఆ కార్యక్రమం ఉద్దేశాన్నే దెబ్బతీస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజావాణికి అధికారులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి