రామన్నపేట ఆంధ్రజ్యోతి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు మహమ్మద్ ఇబ్రహీంతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని సీపీఐ(ఎం) పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇబ్రహీం అనారోగ్యంతో మృతి చెందిన విషయం ఆలస్యంగా తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.
తాను రామన్నపేట డివిజన్ సీపీఐ(ఎం) పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇబ్రహీం తనకు సుపరిచితుడని, అనేక ప్రజా సమస్యలను వార్తలుగా ప్రచురించారని తెలిపారు. వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసిన ఇబ్రహీం, వార్తా అంశాలను అనేక కోణాల్లో పరిశీలించి, సంబంధిత వ్యక్తులను సంప్రదించి నిజనిర్ధారణ చేసిన తర్వాతే వార్తలు రాసేవారని పేర్కొన్నారు.
ఇబ్రహీం మృతి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని సీతారాములు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి జర్నలిస్టు మిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి