లయన్స్ ఐ హాస్పిటల్ నూతన చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన కార్యవర్గంలో కార్యదర్శిగా పెండెం చంద్రశేఖర్, కోశాధికారిగా చిలుముల శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శిగా ఈగ దయాకర్గుప్త ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా, భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మీకాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేష్రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ధర్మారావు ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా గుణగంటి రాములు, మొరిశెట్టి లక్షాది, గుడిపూడి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి