నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. ఫిజిక్స్ ఒక పోస్టు, ఇంగ్లీష్ ఒక పోస్టు, సోషల్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 11న రాజేంద్రనగర్లో హాజరై దరఖాస్తు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీన హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయ్ కోరారు.
PRINT TIME: August 09, 2026 10:01 PM
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
09-08-2026
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పీజీటీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్ తెలిపారు. ఫిజిక్స్ ఒక పోస్టు, ఇంగ్లీష్ ఒక పోస్టు, సోషల్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 11న రాజేంద్రనగర్లో హాజరై దరఖాస్తు ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీన హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజయ్ కోరారు.












































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి