సరూర్నగర్, ఆగస్టు 8: సరూర్నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ (సూపర్ ఎస్ఐ)గా విధులు నిర్వహించిన మారయ్య ‘ఫ్యూచర్ సిటీ’కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
విధుల నిర్వహణలో ఎస్ఐ మారయ్య క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ ప్రజల మన్ననలు పొందారని గడ్డిఅన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సునీల్బాబు కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
బదిలీపై ప్రాంతానికి దూరమవుతున్నందుకు బాధగా ఉన్నప్పటికీ, మారయ్య మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్ఐ మారయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి భవిష్యత్ సేవా ప్రయాణం విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి