రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 08, 2026 08:16 PM
గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.
గుండెపోటుతో కుటుంబ పెద్ద మృతి.. ఆపద్బాంధవుల చేయూత.
08-08-2026
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ అండగా నిలిచింది. జనంపల్లి గ్రామానికి చెందిన అవుల రమేష్ గత నెల 20న గుండెపోటుతో మృతి చెందడంతో భార్య వెంకటమ్మ, ముగ్గురు ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఫౌండేషన్ ముఖ్య సభ్యుడు నీలం శేఖర్ స్పందించి శనివారం బాధిత కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.ముగ్గురు ఆడపిల్లల చదువులు ఆగిపోకుండా భవిష్యత్తులోనూ అండగా ఉంటామని నీలం శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు వేముల సైదులు, బాదే చంద్రశేఖర్, ఈదులకంటి శివకుమార్, సురేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి