భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను పార్టీ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ర్యాకల శ్రీనివాస్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగి రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై చూపిస్తున్న అభిమానం, నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు.
కార్యక్రమంలో భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, నీల ఓం ప్రకాష్గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బల్గూరి మధుసూదన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఏనబోయిన ఆంజనేయులు, మాజీ జడ్పీటీసీలు బీరు మల్లయ్య, సందెల సుధాకర్, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, సర్పంచ్ జక్క రాఘవేందర్రెడ్డి, కస్తూరి పాండు, బాతుక అశోక్, కుతాడి సురేష్, మూలే నాగేంద్రబాబు, కంకల మహేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి