ఎన్నికపై పలువురి అభినందనలు.. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి.
కొండమల్లేపల్లి: మండలంలోని మల్లెలగట్టు వి.టి. కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ పాలకవర్గ సభ్యులు, పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకంతో పాలకవర్గ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని నవీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి