శివాజీనగర్లో విద్యుత్ లైన్, బోర్వెల్ మోటార్ ప్రారంభం
గ్రామ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని యల్లగిరి గ్రామ సర్పంచ్ రిక్కల మహేందర్ రెడ్డి అన్నారు. యల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన నిధులతో ఏర్పాటు చేసిన 200 మీటర్ల విద్యుత్ లైన్తో పాటు సుమారు 900 అడుగుల బోర్వెల్ మోటార్ పంపును సర్పంచ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే కాలనీలో బోర్వెల్ ఏర్పాటు సాధ్యమైందని, గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే గ్రామానికి తన బోర్ బావిని కేటాయించిన టేకుల దామోదర్ రెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలోని అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రాహ్మణి, ఉప సర్పంచ్ కందకట్ల సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మౌనిక, సంతోష, శివశంకర్, పూజ, మల్లేష్, సందీప్, ఇబ్రాహీం, టేకుల దామోదర్ రెడ్డి, జంగయ్య గౌడ్, అశోక్ గౌడ్, వెంకట్ రెడ్డి, బాలరెడ్డి, యాదిరెడ్డి, పద్మారెడ్డి, జంగారెడ్డి, రాంరెడ్డి, నర్సిరెడ్డి, కిరణ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, గోవర్ధన్ యాదవ్, అంజయ్య గౌడ్, లచ్చయ్య, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి