రామన్నపేట మండలానికి చెందిన కాటం నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ మైనార్టీ సెల్ కన్వీనర్, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ శుక్రవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన షేక్ చాంద్, తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యం, రూ.2,500 నగదును అందజేశారు. అలాగే కాటం నరసింహ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుని అండగా నిలవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహమ్మద్ జానీ, మల్లం సైదులు, కాటం రమేష్, కాటం నిర్మల, మమతతో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి