: రామన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన మోలుగురి రవిని గురువారం టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గడ్డం యాదగిరి మాట్లాడుతూ, ప్రజలకు సత్వర, పారదర్శక, నాణ్యమైన పోలీసు సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సీఐ రవి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని కోరారు.
నూతన బాధ్యతలను స్వీకరించిన సీఐ మోలుగురి రవి ప్రజలకు అందుబాటులో ఉంటూ చట్టం ముందు అందరూ సమానమే అనే భావనతో సేవలు అందిస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇస్కిళ్ల గ్రామ ఉపసర్పంచ్ బందెల నాగేష్, వల్లమల్ల యాదయ్య, నరసింహ, గడ్డం మచ్చగిరితో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి