Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:59 PM

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్
06-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ఎలాంటి వేధింపులకు గురైనా భయాందోళన చెందకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మథకుమార్ సూచించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మోజీగూడెం గ్రామంలో గల జెన్‌టెక్ కంపెనీలో గురువారం మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈవ్‌టీజింగ్, లైంగిక, సైబర్ వేధింపుల నిరోధానికి ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించారు. 'షి టీమ్స్', ఉమెన్ సేఫ్టీ, సీడబ్ల్యూడీ (క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్) విభాగాల ద్వారా అందుబాటులో ఉన్న రక్షణ సేవలను, అత్యవసర సమయాల్లో పోలీసుల నుంచి పొందే సాయాన్ని తెలియజేశారు. ​మహిళల భద్రతకు చౌటుప్పల్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, పని ప్రదేశాల్లో లేదా వెలుపల ఏవైనా సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్

Article Image

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ఎలాంటి వేధింపులకు గురైనా భయాందోళన చెందకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మథకుమార్ సూచించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మోజీగూడెం గ్రామంలో గల జెన్‌టెక్ కంపెనీలో గురువారం మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈవ్‌టీజింగ్, లైంగిక, సైబర్ వేధింపుల నిరోధానికి ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించారు. 'షి టీమ్స్', ఉమెన్ సేఫ్టీ, సీడబ్ల్యూడీ (క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్) విభాగాల ద్వారా అందుబాటులో ఉన్న రక్షణ సేవలను, అత్యవసర సమయాల్లో పోలీసుల నుంచి పొందే సాయాన్ని తెలియజేశారు. ​మహిళల భద్రతకు చౌటుప్పల్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, పని ప్రదేశాల్లో లేదా వెలుపల ఏవైనా సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News