Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి. తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 07:05 PM

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
06-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News