నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి