నార్కట్పల్లి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని గణేశుడికి భక్తుల వినూత్న వినతి.
నార్కట్పల్లి: రోడ్డు నిర్మాణ పనులు తరచూ నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇకనైనా పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరుతూ భక్తులు వినాయకుడికి వినూత్నంగా వినతిపత్రం సమర్పించారు
. నార్కట్పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద భక్తులు ఈ మేరకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, తమ సమస్యను గణేశుడి దృష్టికి తీసుకెళ్లారు.
‘‘విఘ్నాలను తొలగించే దేవుడివి గణేశా.. మా ఊరిలో రోడ్డు పనులు తరచూ ఆగిపోతున్నాయి. రహదారి అధ్వానంగా ఉండటంతో ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సమాచారం అందించాలి’’ అంటూ భక్తులు గణేశుడిని వేడుకున్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి రోడ్డు సమస్యను తీసుకెళ్లి, నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా విఘ్నాలు తొలగించాలని కోరుతూ వినాయకుడి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి