Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:49 PM

గుండ్రాంపల్లి వడ్రంగి సహకార సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి ఏకగ్రీవ ఎన్నిక

గుండ్రాంపల్లి వడ్రంగి సహకార సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి ఏకగ్రీవ ఎన్నిక

గుండ్రాంపల్లి వడ్రంగి సహకార సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి ఏకగ్రీవ ఎన్నిక
20-09-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, సెప్టెంబర్ 20: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘం ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి, ఉపాధ్యక్షుడిగా అనుముల ధనంజయాచారి, ప్రధాన కార్యదర్శిగా పంతంగి మదనాచారి, కోశాధికారిగా మండలోజు విజయకుమార్, సహాయ కార్యదర్శిగా వెల్లంకి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా అనుముల ఈశ్వరమ్మ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా మండలోజు బ్రహ్మచారి, అనుముల విశ్వరూపం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కంచర్ల నారాయణచారి మాట్లాడుతూ.. 1960లో ఏర్పడిన వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల సంక్షేమం, అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో అనుముల నరసింహాచారి, అనుముల నాగభూషణం, వెల్లంకి జగదీశ్వరచారి, అనుముల రమేష్‌చారి, మండలోజు శ్రీనివాసాచారి, వెల్లంకి పురుషోత్తమాచారి, అనుముల శ్రీనివాస్, అనుముల వెంకటాచారి, అనుముల విశ్వరూపంచారి, అనుముల కృష్ణకాంత్‌చారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుండ్రాంపల్లి వడ్రంగి సహకార సంఘానికి నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి ఏకగ్రీవ ఎన్నిక

Article Image

చిట్యాల, సెప్టెంబర్ 20: చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలోని వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం సంఘం ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కంచర్ల నారాయణచారి, ఉపాధ్యక్షుడిగా అనుముల ధనంజయాచారి, ప్రధాన కార్యదర్శిగా పంతంగి మదనాచారి, కోశాధికారిగా మండలోజు విజయకుమార్, సహాయ కార్యదర్శిగా వెల్లంకి విజయ్‌కుమార్, మహిళా కార్యదర్శిగా అనుముల ఈశ్వరమ్మ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా మండలోజు బ్రహ్మచారి, అనుముల విశ్వరూపం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కంచర్ల నారాయణచారి మాట్లాడుతూ.. 1960లో ఏర్పడిన వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విశ్వకర్మలు అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి సమాజంలో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల సంక్షేమం, అభివృద్ధికి నూతన కార్యవర్గం సమష్టిగా పనిచేస్తుందని తెలిపారు.కార్యక్రమంలో అనుముల నరసింహాచారి, అనుముల నాగభూషణం, వెల్లంకి జగదీశ్వరచారి, అనుముల రమేష్‌చారి, మండలోజు శ్రీనివాసాచారి, వెల్లంకి పురుషోత్తమాచారి, అనుముల శ్రీనివాస్, అనుముల వెంకటాచారి, అనుముల విశ్వరూపంచారి, అనుముల కృష్ణకాంత్‌చారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News