Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ కోటాలో మెడికల్‌ సీటు. వనపర్తి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో చేరిన మేడిపల్లి యువతి. అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 12:00 PM

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్
20-09-2026 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వంటమనిషి జీతం చేయడానికి రూ.14 వేల లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హాస్టల్ వార్డెన్ భూక్యా వాల్ సింహ.. వంటమనిషి జీతం మంజూరు చేసేందుకు రూ.14 వేలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని వంటమనిషి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు.

ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో వల పన్నారు. అధికారుల సూచన మేరకు వంటమనిషి రూ.14 వేల లంచాన్ని వార్డెన్‌కు అందించగా, డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. అనంతరం వార్డెన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

Article Image

వంటమనిషి జీతం చేయడానికి రూ.14 వేల లంచం డిమాండ్ చేసిన హాస్టల్ వార్డెన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

హాస్టల్ వార్డెన్ భూక్యా వాల్ సింహ.. వంటమనిషి జీతం మంజూరు చేసేందుకు రూ.14 వేలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడం ఇష్టంలేని వంటమనిషి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు.

ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో వల పన్నారు. అధికారుల సూచన మేరకు వంటమనిషి రూ.14 వేల లంచాన్ని వార్డెన్‌కు అందించగా, డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. అనంతరం వార్డెన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News