Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నాయకుడికి జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:04 AM

డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైన కారు.. వ్యక్తి సజీవ దహనం

డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైన కారు.. వ్యక్తి సజీవ దహనం

డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైన కారు.. వ్యక్తి సజీవ దహనం
20-09-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సూర్యాపేట: ఖమ్మం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం కాగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. మంటల తీవ్రతతో కారు పూర్తిగా కాలిపోవడంతో వివరాలు సేకరించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Sthanikam

డివైడర్‌ను ఢీకొట్టి దగ్ధమైన కారు.. వ్యక్తి సజీవ దహనం

Article Image

సూర్యాపేట: ఖమ్మం–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం కాగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. మంటల తీవ్రతతో కారు పూర్తిగా కాలిపోవడంతో వివరాలు సేకరించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News