తెలంగాణలో ఏ ప్రాంతంలో నిరుద్యోగులుగా ఉన్న యువతకైనా ఏ విధంగానైనా ఉపాధి కల్పించాలని, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే తపనతోనే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద జాబ్ మేళా కార్యక్రమాన్ని చేపట్టారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కోదాడ సీసీ రెడ్డి కన్వెన్షన్ లో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని మా అందరినీ ఆహ్వానించి, యువతను కలుసుకునే అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తు న్నానని అన్నారు. ఈ సంవత్సరం వారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా.. తీవ్రమైన ప్రభావంతోనే మన ప్రాజెక్టులు నిలబడ్డాయన్నారు. చాలా మంది రైతాంగం ఇంకా రెండు పంటలు వేయాలని ఎదురు చూస్తున్నారని, 24 గంటలు వేసిన పంటలను ఏ విధంగానైనా కాపాడాలనే తపనతోనే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారని కొనియాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వడ్లు కొనుగోలు చేసిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. తాము ఎప్పటికప్పుడు మంత్రి ఉత్తమ్ తో చర్చిస్తూ ఉంటామని, ఎక్కడ నోట్ల పాటలు ఉన్నాయి, ఏం చేద్దాం అనే అంశాలపై మాట్లాడుకుంటామన్నారు.
అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమగ్ర అభివృద్ధి, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయడమేనని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి