Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:44 PM

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌
19-09-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట సెప్టెంబర్ :

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అన్నారు. శనివారం బోగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. పిల్లల చదువు, క్రమశిక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధానోపాధ్యాయురాలు హెచ్‌.ఎం. శ్రీలత పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు చూపించి వారి చదువుపై చర్చించారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్‌యాదవ్‌, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ పబ్బు జ్యోతి, అంగన్‌వాడీ టీచర్‌ బత్తుల వసంత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌

Article Image

రామన్నపేట సెప్టెంబర్ :

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని బోగారం గ్రామ సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అన్నారు. శనివారం బోగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ–తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. పిల్లల చదువు, క్రమశిక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధానోపాధ్యాయురాలు హెచ్‌.ఎం. శ్రీలత పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు చూపించి వారి చదువుపై చర్చించారు.

కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్‌యాదవ్‌, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్‌ పబ్బు జ్యోతి, అంగన్‌వాడీ టీచర్‌ బత్తుల వసంత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News