మేడిపల్లి, సెప్టెంబర్ 20: పట్టుదలతో చదివి మేడిపల్లి యువతి జిల్లామొని భావన ఎంబీబీఎస్ సీటు సాధించింది. వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ కోటా కింద సీటు దక్కించుకుంది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్లో భావనకు సీటు కేటాయించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన జిల్లామొని వెంకటేష్, మంజుల దంపతుల కుమార్తె భావన. నీట్లో 1,31,878 జాతీయ ర్యాంకు సాధించి ఈ అవకాశాన్ని దక్కించుకుంది.
శనివారం వనపర్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరిక ప్రక్రియను పూర్తి చేసి, కళాశాల ప్రిన్సిపాల్కు అవసరమైన పత్రాలను సమర్పించింది. భావనకు ఎంబీబీఎస్ సీటు రావడంపై కళాశాల అదనపు డీఎంఈ, ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు. ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
భావన వైద్య విద్యలో అడుగుపెట్టడంపై గ్రామస్థులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి