Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:52 PM

12 అంశాల్లో ఇప్పటికే రెండు జీవోలు జారీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

12 అంశాల్లో ఇప్పటికే రెండు జీవోలు జారీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

12 అంశాల్లో ఇప్పటికే రెండు జీవోలు జారీ.  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
19-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

22ఎ సమస్యలకు త్వరలో చెక్‌

వారంలోగా ప్రభుత్వ ఆదేశాలు.. నెల రోజుల్లో సమస్యల పరిష్కారం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 19 స్థానికం ప్రతినిధి :

22ఎ కింద ఉన్న భూ సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు వెలువడేలా చర్యలు తీసుకుంటున్నామని, నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు.ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని 44 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలను శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మంత్రి పొంగులేటి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించిన 12 అంశాలపై ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో కాలనీల సమస్యకు జీవో 118, సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76 జారీ చేశామని తెలిపారు.

44 కాలనీల సమస్య పరిష్కారం

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని 64 కాలనీల్లో 44 కాలనీల సమస్యలను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఎవరి ఇళ్లూ కూల్చబోమని స్పష్టం చేశారు.

సింగరేణి సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం

సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, 45 రోజుల్లో భూ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ జీవో 118 ద్వారా మరికొంతమంది సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

12 అంశాల్లో ఇప్పటికే రెండు జీవోలు జారీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Article Image

22ఎ సమస్యలకు త్వరలో చెక్‌

వారంలోగా ప్రభుత్వ ఆదేశాలు.. నెల రోజుల్లో సమస్యల పరిష్కారం

హైదరాబాద్‌ సెప్టెంబర్ 19 స్థానికం ప్రతినిధి :

22ఎ కింద ఉన్న భూ సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు వెలువడేలా చర్యలు తీసుకుంటున్నామని, నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు.ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని 44 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలను శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో మంత్రి పొంగులేటి, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజారుద్దీన్‌ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించిన 12 అంశాలపై ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో కాలనీల సమస్యకు జీవో 118, సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76 జారీ చేశామని తెలిపారు.

44 కాలనీల సమస్య పరిష్కారం

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని 64 కాలనీల్లో 44 కాలనీల సమస్యలను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఎవరి ఇళ్లూ కూల్చబోమని స్పష్టం చేశారు.

సింగరేణి సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం

సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, 45 రోజుల్లో భూ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ జీవో 118 ద్వారా మరికొంతమంది సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మధుయాష్కీ గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News