Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:01 PM

అట్టహాసంగా 18వ అవతరణ దినోత్సవ వేడుకలు

అట్టహాసంగా 18వ అవతరణ దినోత్సవ వేడుకలు

అట్టహాసంగా 18వ అవతరణ దినోత్సవ వేడుకలు
19-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 18వ అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్యలోనూ రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలు, ఉన్నత విద్యపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రతిభావంతులకు గోల్డ్‌ మెడల్స్‌

అకడమిక్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ అందజేసి సత్కరించారు. వివిధ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్‌, రంగోలి తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

అలుమ్ని అసోసియేషన్‌ కోఆర్డినేటర్‌ డా. ఏ. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గోల్డ్‌ మెడల్స్‌, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మధు మాట్లాడుతూ.. విద్యార్థులు పీజీ, పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇందిర, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. మధు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. శేఖర్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ డా. అపర్ణ చతుర్వేది, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అట్టహాసంగా 18వ అవతరణ దినోత్సవ వేడుకలు

Article Image

హయత్‌నగర్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 18వ అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డా. పి. సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్యలోనూ రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలు, ఉన్నత విద్యపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ప్రతిభావంతులకు గోల్డ్‌ మెడల్స్‌

అకడమిక్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ అందజేసి సత్కరించారు. వివిధ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. వ్యాసరచన, వక్తృత్వం, డ్రాయింగ్‌, రంగోలి తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

అలుమ్ని అసోసియేషన్‌ కోఆర్డినేటర్‌ డా. ఏ. దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో గోల్డ్‌ మెడల్స్‌, ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్‌ స్టూడెంట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ మధు మాట్లాడుతూ.. విద్యార్థులు పీజీ, పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్స్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఇందిర, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డా. మధు, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డా. శేఖర్‌, కల్చరల్‌ కోఆర్డినేటర్‌ డా. అపర్ణ చతుర్వేది, అధ్యాపకులు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News