Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 07:33 PM

శిశురక్ష వైద్యుల సేవలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు

శిశురక్ష వైద్యుల సేవలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు

శిశురక్ష వైద్యుల సేవలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు
19-09-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నెలలు నిండకముందే కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డి శిశురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు 50 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. శిశువు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించడంతో ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగుపడి 980 గ్రాముల నుంచి 1.6 కిలోల బరువుకు చేరుకుంది. బిడ్డ తల్లిదండ్రులు తమ పరిస్థితిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే శిశువును శిశురక్ష ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స విజయవంతం కావడంతో విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శిశువును పరామర్శించి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోనే అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక వైద్యం అందించి పసిబిడ్డ ప్రాణాలు కాపాడటం అభినందనీయమని తెలిపారు. 50 రోజుల చికిత్సకు రూ.4 లక్షలకు పైగా ఖర్చు కాగా, తల్లిదండ్రులు సుమారు రూ.2 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి చెప్పగా, ఆసుపత్రి యాజమాన్యం మానవతా దృక్పథంతో బిల్లులో సగం మొత్తాన్ని మినహాయించింది.





Sthanikam

శిశురక్ష వైద్యుల సేవలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అభినందనలు

Article Image

నెలలు నిండకముందే కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించిన నవజాత శిశువుకు సంగారెడ్డి శిశురక్ష చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్యులు 50 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. శిశువు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించడంతో ప్రస్తుతం శిశువు ఆరోగ్యం మెరుగుపడి 980 గ్రాముల నుంచి 1.6 కిలోల బరువుకు చేరుకుంది. బిడ్డ తల్లిదండ్రులు తమ పరిస్థితిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి వివరించడంతో ఆయన వెంటనే శిశువును శిశురక్ష ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స విజయవంతం కావడంతో విషయం తెలుసుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి శిశువును పరామర్శించి వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సంగారెడ్డిలోనే అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక వైద్యం అందించి పసిబిడ్డ ప్రాణాలు కాపాడటం అభినందనీయమని తెలిపారు. 50 రోజుల చికిత్సకు రూ.4 లక్షలకు పైగా ఖర్చు కాగా, తల్లిదండ్రులు సుమారు రూ.2 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని తాను చెల్లిస్తానని జగ్గారెడ్డి చెప్పగా, ఆసుపత్రి యాజమాన్యం మానవతా దృక్పథంతో బిల్లులో సగం మొత్తాన్ని మినహాయించింది.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News