ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
EDIGA NAVEENKUMAR
పెనుకొండ : ABN ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్ పెనుకొండ డీఎస్పీని కోరారు.
ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధంగా ఉండి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలను దూషించేలా ప్రసారం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికల్లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో సామాజిక విభేదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
కావున, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్మెంట్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ దూషణాత్మక కంటెంట్ను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి