Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 03:42 PM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
April 09, 2026 02:05 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్ పెనుకొండ డీఎస్పీని కోరారు.


ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధంగా ఉండి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.


ప్రత్యేకంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలను దూషించేలా ప్రసారం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికల్లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో సామాజిక విభేదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


కావున, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News