Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
09-04-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్ పెనుకొండ డీఎస్పీని కోరారు.


ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధంగా ఉండి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.


ప్రత్యేకంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలను దూషించేలా ప్రసారం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికల్లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో సామాజిక విభేదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


కావున, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.


Sthanikam

ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు

Article Image

పెనుకొండ : ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్ పెనుకొండ డీఎస్పీని కోరారు.


ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై అవమానకర, అసత్య వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు జర్నలిజం నైతిక విలువలకు విరుద్ధంగా ఉండి, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు.


ప్రత్యేకంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీయే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలను దూషించేలా ప్రసారం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం డిజిటల్ వేదికల్లో కూడా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో సామాజిక విభేదాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


కావున, సంబంధిత యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే, ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News