Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 01:50 PM

మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్

మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్

మానవత్వం చాటిన స్థానికం దినపత్రిక ఎడిటర్  డాక్టర్ కొండ మల్లేశం గౌడ్
July 01, 2026 12:03 PM 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వృద్ధుడికి అండగా నిలిచి ఆశ్రయ కేంద్రానికి తరలించిన పోలీసులు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ వద్ద గత నాలుగు రోజులుగా అనాథలా తిరుగుతున్న వృద్ధుడు సుబ్రహ్మణ్యంను గుర్తించిన స్థానికం దినపత్రిక ఎడిటర్ డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ మానవత్వంతో స్పందించారు.

వృద్ధుడిని కలిసి తన వంతుగా రూ.500 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వెంటనే చౌటుప్పల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధకుమార్ కు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు పెట్రోలింగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, డ్రైవర్ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా చౌటుప్పల్ "అమ్మ నాన్న" ఆశ్రయ కేంద్రానికి తరలించారు.

అనంతరం వృద్ధుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, వారిని గుర్తించి సురక్షితంగా అప్పగించేలా చర్యలు చేపట్టాలని పెట్రోలింగ్ సిబ్బందికి సూచించినట్లు డాక్టర్ కొండ మల్లేశం గౌడ్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News