Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 05:47 PM

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు

సీపీఎం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపు
June 30, 2026 03:41 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, జూన్ 30: జూలై 4, 5, 6 తేదీలలో భువనగిరి పట్టణంలోని శ్రీ సాయి శ్రీనివాస (దివ్య) ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన సీపీఎం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందన్నారు.

అలాగే ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) పేరుతో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజల ఓటు హక్కులను హరించేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఎస్‌ఐఆర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలకు రాజకీయ అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తరగతులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి. జహంగీర్, రాష్ట్ర నాయకుడు బండారి రమేష్ తదితరులు బోధిస్తారని తెలిపారు.

ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేష్, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు కొండపురం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News