శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం
శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం
Komidala Mahender reddy
అనుముల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం గ్రామంలోని శివాలయంలో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.దుండగులు ఆలయంలో ఉన్న వెండి చెంబులు, వెండి ప్లేట్, అమ్మవారికి అలంకరించిన తులం బంగారు పుస్తెలు, హుండీ నగదు సహా ఇతర పూజా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు తాళాలు ధ్వంసమైనట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.
ఘటన తెలిసిన వెంటనే గ్రామ పెద్దలు, భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడటం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వస్తువుల విలువ, ఇతర వివరాలపై విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
దేవాలయాల్లో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తుండగా, హజారిగూడెం ఘటన స్థానికంగా కలకలం రేపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి