Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:07 AM

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం
30-06-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అనుముల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం గ్రామంలోని శివాలయంలో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.దుండగులు ఆలయంలో ఉన్న వెండి చెంబులు, వెండి ప్లేట్, అమ్మవారికి అలంకరించిన తులం బంగారు పుస్తెలు, హుండీ నగదు సహా ఇతర పూజా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు తాళాలు ధ్వంసమైనట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఘటన తెలిసిన వెంటనే గ్రామ పెద్దలు, భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడటం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వస్తువుల విలువ, ఇతర వివరాలపై విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

దేవాలయాల్లో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తుండగా, హజారిగూడెం ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Sthanikam

శివాలయంలో చోరీ.. హుండీతో పాటు బంగారం, వెండి వస్తువులు మాయం

Article Image

అనుముల, నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అనుముల మండలం హజారిగూడెం గ్రామంలోని శివాలయంలో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి హుండీతో పాటు విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.దుండగులు ఆలయంలో ఉన్న వెండి చెంబులు, వెండి ప్లేట్, అమ్మవారికి అలంకరించిన తులం బంగారు పుస్తెలు, హుండీ నగదు సహా ఇతర పూజా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు తాళాలు ధ్వంసమైనట్లు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఘటన తెలిసిన వెంటనే గ్రామ పెద్దలు, భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. పవిత్ర దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడటం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన వస్తువుల విలువ, ఇతర వివరాలపై విచారణ కొనసాగుతోంది. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.

దేవాలయాల్లో వరుస చోరీలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తుండగా, హజారిగూడెం ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News