అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు
EDIGA NAVEENKUMAR
పరిగి, జూన్ 29: పరిగి మండలం ఊటకూరు గ్రామ సమీపంలోని జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పరిగి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నది పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేసి వాటి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమతులు ఉన్నప్పటికీ, ఇసుకను అనుమతించిన ప్రాంతానికే తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ట్రాక్టర్ల వెంట వెళ్లి రవాణాను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి