Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:11 AM

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు
29-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పరిగి, జూన్ 29: పరిగి మండలం ఊటకూరు గ్రామ సమీపంలోని జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పరిగి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నది పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.


ఈ తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేసి వాటి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమతులు ఉన్నప్పటికీ, ఇసుకను అనుమతించిన ప్రాంతానికే తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ట్రాక్టర్ల వెంట వెళ్లి రవాణాను పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

Sthanikam

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

Article Image

పరిగి, జూన్ 29: పరిగి మండలం ఊటకూరు గ్రామ సమీపంలోని జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పరిగి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నది పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.


ఈ తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేసి వాటి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమతులు ఉన్నప్పటికీ, ఇసుకను అనుమతించిన ప్రాంతానికే తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ట్రాక్టర్ల వెంట వెళ్లి రవాణాను పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News