Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 02:37 PM

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు

అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపిన పరిగి పోలీసులు
June 29, 2026 12:58 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పరిగి, జూన్ 29: పరిగి మండలం ఊటకూరు గ్రామ సమీపంలోని జయమంగళి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పరిగి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్సై రవికుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం నది పరిసరాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.


ఈ తనిఖీల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేసి వాటి అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమతులు ఉన్నప్పటికీ, ఇసుకను అనుమతించిన ప్రాంతానికే తరలిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ట్రాక్టర్ల వెంట వెళ్లి రవాణాను పర్యవేక్షించారు.


ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిరంతర నిఘా కొనసాగుతుందని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News