సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
K.RAVI
రెడ్డిబావి గ్రామంలో పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామానికి చెందిన మాదగోని అండాలుకు మంజూరైన రూ. 60 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును ఆదివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారురాలికి అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నందగిరి పరమేష్, మాజీ అధ్యక్షుడు గంగాపురం వెంకటేశం, ఉపాధ్యక్షుడు ఆవుల రాజు, నాయకులు నందగిరి యాదయ్య, పల్లె వెంకటేశం, శ్యామల మల్లేష్, రేపాక శ్రీను, మాదగోని వంశీ, పిసటి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి