Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 07:00 PM

50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య

50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య

50 ఏళ్లైనా డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల దుర్భర జీవనం – జల్లెల పెంటయ్య
June 28, 2026 04:21 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Hyderabad
Alpha Raw

దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దళిత కాలనీలు మాత్రం ఇప్పటికీ కనీస మౌలిక వసతులకు నోచుకోక అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జల్లెల పెంటయ్య విమర్శించారు.

రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలోని దళిత కాలనీలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీ ఏర్పడి దాదాపు 50 ఏళ్లు గడిచినా ఇప్పటికీ శాశ్వత డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

డ్రైనేజీ కాలువలు లేక ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వీధుల్లోనే నిలిచిపోతుండటంతో కాలనీలు బురదమయంగా మారాయని, ప్రజలు నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిల్వ నీటి కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అర శతాబ్దం చరిత్ర కలిగిన దళిత కాలనీపై ఈ స్థాయి నిర్లక్ష్యం, వివక్ష తగదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన శాశ్వత డ్రైనేజీ వ్యవస్థతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్, పార్టీ సీనియర్ నాయకులు బండ జగన్మోహన్ రెడ్డి, బోయిని మల్లేష్, నేమనంది లింగయ్య, నాగటి మహేష్, ఏభూషి సాయిలు, నాగటి నరేష్, నోముల లక్ష్మమ్మ, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News