PRINT TIME: June 28, 2026 01:40 PM
పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్
పోలియోకు చెక్.. ప్రతి చిన్నారికి చుక్క! సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్
June 28, 2026 09:37 AM
26 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, జూన్ 28: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, ఐదో వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, నాయకులు రాపోలు శ్రీకాంత్, గుంజే ఆంజనేయులు, అంగన్వాడీ టీచర్ బత్తుల వసంత, ఆరోగ్య శాఖ ఎంపీహెచ్ఏ రత్నకుమారి, ఆశా కార్యకర్తలు సంధ్య, పారిజాత, గ్రామస్తులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి