కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు
కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు
Editor Desk
ఎమ్మిగనూరు, : తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామ శివాలయంలో ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.
కార్యక్రమాల కరపత్రాలను శనివారం శివాలయంలో భక్తులతో కలిసి ఆవిష్కరించారు. జూన్ 30 నుంచి జూలై 2 వరకు డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు, జూలై 3న గోపూజ, కుంకుమార్చన, ప్రతిరోజూ స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పురోహితులు ఈరన్నరావు, వేదపండితులు శివమణి, శంకరని, దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, భూషణరావు, శంకరప్ప, కేశన్న, లక్ష్మీకాంత్, నరసప్ప, నాయుడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి