Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:45 AM

కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు

కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు

కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు
27-06-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, : తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామ శివాలయంలో ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

కార్యక్రమాల కరపత్రాలను శనివారం శివాలయంలో భక్తులతో కలిసి ఆవిష్కరించారు. జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు, జూలై 3న గోపూజ, కుంకుమార్చన, ప్రతిరోజూ స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు ఈరన్నరావు, వేదపండితులు శివమణి, శంకరని, దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, భూషణరావు, శంకరప్ప, కేశన్న, లక్ష్మీకాంత్, నరసప్ప, నాయుడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కడిమెట్లలో ఐదు రోజుల ధార్మికోత్సవాలు

Article Image

ఎమ్మిగనూరు, : తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామ శివాలయంలో ఈ నెల 30 నుంచి జూలై 4 వరకు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

కార్యక్రమాల కరపత్రాలను శనివారం శివాలయంలో భక్తులతో కలిసి ఆవిష్కరించారు. జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు డమాం జగదీశ్ ధార్మిక ప్రవచనాలు, జూలై 3న గోపూజ, కుంకుమార్చన, ప్రతిరోజూ స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు ఈరన్నరావు, వేదపండితులు శివమణి, శంకరని, దినేశ్, భజన మండలి సభ్యులు కంసాలి మోహన్, భూషణరావు, శంకరప్ప, కేశన్న, లక్ష్మీకాంత్, నరసప్ప, నాయుడు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News