అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ
అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ
Editor Desk
రామన్నపేట మండలంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు ప్రజల ఐక్య పోరాట విజయమని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రహదారి బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్, ఊట్కూరు నరసింహ తదితరులు మాట్లాడారు.
ప్రజల విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు రహదారి బంగ్లాలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో కందుల హనుమంతు, ఎండీ జమీరుద్దీన్, బత్తుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి