Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ
27-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు ప్రజల ఐక్య పోరాట విజయమని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రహదారి బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్, ఊట్కూరు నరసింహ తదితరులు మాట్లాడారు.

ప్రజల విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు రహదారి బంగ్లాలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో కందుల హనుమంతు, ఎండీ జమీరుద్దీన్, బత్తుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు.. 29న విజయోత్సవ సభ

Article Image

రామన్నపేట మండలంలో ప్రతిపాదించిన అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు ప్రజల ఐక్య పోరాట విజయమని పర్యావరణ పరిరక్షణ వేదిక నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం రహదారి బంగ్లాలో నిర్వహించిన సమావేశంలో కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్, ఊట్కూరు నరసింహ తదితరులు మాట్లాడారు.

ప్రజల విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 29న మధ్యాహ్నం 12 గంటలకు రహదారి బంగ్లాలో అభినందన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వెల్లడించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు, వ్యాపారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో కందుల హనుమంతు, ఎండీ జమీరుద్దీన్, బత్తుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News