Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం ఉమ్మడి నల్గొండకు జాతీయ కీర్తి.. ఒకే వేదికపై ఇద్దరు ప్రతిభావంతులకు గౌరవ డాక్టరేట్లు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 15, 2026 10:54 PM

హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం

హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం.. వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం

హారతులు, అక్షింతలతో విద్యార్థులకు ఘన స్వాగతం..   వెంపటి ప్రభుత్వ పాఠశాలలో వినూత్నంగా విద్యా సంవత్సరం ప్రారంభం
June 15, 2026 09:09 PM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar


నూతన విద్యా సంవత్సరం సందర్భంగా తుంగతుర్తి మండలం వెంపటి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞాన జ్యోతులు వెలగాలని ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులు చిన్నారులను హారతులుహారతులు, అక్షింతలతో ఆశీర్వదించి తరగతి గదుల్లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. సరస్వతీ మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విద్యార్థులను తరగతి గదుల్లోకి తీసుకెళ్లడంతో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని తలపించింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులుభీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... గ్రామంలోని బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనీ చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్నం భోజనం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లెపాక రవీందర్,

గట్టు మాధవి ,

నిమ్మరబోయిన నవీన ,

బండారు భవాని ,

జీడి అనిల్ కుమార్ ,

మిట్ట గడుపుల విక్రమ్ ,

మాలోతు కృష్ణ ,

గుండ్ల ఆంజనేయులు ,

రామనబోయిన మౌనిక ,

అబ్బ గాని మంజుల, పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News