చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
Komidala Mahender reddy
నల్గొండ, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల శివారులో భువనగిరి రోడ్డుపై ఉన్న శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో టాటా ఏసీ వాహనం కారును ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారం ప్రకారం, భువనగిరి వైపు నుంచి నల్గొండ దిశగా వస్తున్న రెండు వాహనాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని దాటేందుకు టాటా ఏసీ డ్రైవర్ ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి కారును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతింది
.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి గుర్తింపు తదితర అంశాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి