Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:23 AM

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
06-06-2026 394 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల శివారులో భువనగిరి రోడ్డుపై ఉన్న శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో టాటా ఏసీ వాహనం కారును ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం ప్రకారం, భువనగిరి వైపు నుంచి నల్గొండ దిశగా వస్తున్న రెండు వాహనాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని దాటేందుకు టాటా ఏసీ డ్రైవర్ ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి కారును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతింది

.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి గుర్తింపు తదితర అంశాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

Article Image

నల్గొండ, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల శివారులో భువనగిరి రోడ్డుపై ఉన్న శ్రీ బాల నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో టాటా ఏసీ వాహనం కారును ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం ప్రకారం, భువనగిరి వైపు నుంచి నల్గొండ దిశగా వస్తున్న రెండు వాహనాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ముందున్న వాహనాన్ని దాటేందుకు టాటా ఏసీ డ్రైవర్ ప్రయత్నించగా నియంత్రణ కోల్పోయి కారును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఢీకొన్న ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతింది

.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి గుర్తింపు తదితర అంశాలు ఇంకా తెలియరాలేదు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News