Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 06:21 AM

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం

పేదల మొహంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్  ప్రభుత్వ ద్వేయం
June 01, 2026 07:47 PM 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఇండ్లు లేని ప్రతి నిరుపేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, సర్పంచ్ చిలకల మంజుల, ఉపసర్పంచ్ శ్రీకాంత్ అన్నారు. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత స్థానికఎమ్మెల్యే మందుల సామేల్ ఆదేశానుసారంగా సోమవారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో నిర్మించిన

ఇందిరమ్మ లబ్ది దారులు

వంగాల యాకన్న ,బుద్ధ సోమన్న, బండారి సోమేశ్వర్ , ముత్యం చిన్న యాకయ్య నిర్మించినఇందిరమ్మ ఇళ్లలను ప్రారంభించి మాట్లాడారు.

అనంతరం వారు మాట్లాడుతూ.... గత ఎమ్మెల్యే ఎన్నడు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి పట్టించుకోలేదని, ఇళ్లను నిర్మిస్తామని చెప్పి ప్రజలనుమోసం చేశారని ఆరోపించారు, ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ మాట ఇచ్చిన ప్రకారం గ్రామాoల్లో అర్హులైన నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లలను నిర్మిస్తామని చెప్పి, మాట ప్రకారమే ఇల్లు నిర్మించారని అన్నారు. రెండవ దశలో ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వం డబల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి పదేళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దక్కిందని అన్నారు. ప్రతీ ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించిందని అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మనీ అన్నారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం అని పేర్కొన్నారు.

గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల వెంకన్న, మాజీ సర్పంచ్ చంద వెంకన్న, వార్డు సభ్యుడు దూది గాని వీరన్న,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోతి యాకయ్య, వంగాల యాకన్న, యువజన నాయకులు కొండ సాయి, కోటగిరి మహేష్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News