నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్గా బైండ్ల కృష్ణ ఎంపిక
నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్గా బైండ్ల కృష్ణ ఎంపిక
Krishna
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని తలేలమ్మ గ్రామ శివారులో ఎల్లమ్మ టెంపుల్ సన్నిధిలో జాతీయ తెలుగు దినపత్రిక సందేశ టైమ్స్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందం ఆధ్వర్యంలో బోరంచ గ్రామానికి చెందిన స్థానికం తెలుగు దినపత్రిక సబ్ ఎడిటర్ బైండ్ల కృష్ణను నేషనల్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.అనంతరం బైండ్ల కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర వైస్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన సందేశ టైమ్స్ వ్యవస్థాపకులు & సీఈఓ శెట్టి వెంకట్ గౌడ్, పబ్లిషర్ కాశే అమృత మరియు బృందానికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సందేశ టైమ్స్ స్టేట్ బృంద సభ్యులు, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, వివిధ మండలాల రిపోర్టర్లు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి