ఎమ్మెల్యే సామేల్ పైచేస్తున్న ఆరోపణలు మానుకోవాలి; కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య.
ఎమ్మెల్యే సామేల్ పైచేస్తున్న ఆరోపణలు మానుకోవాలి; కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెస్ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య.
Bandi Kiran Kumar
తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కందుకూరి లక్ష్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత నియోజకవర్గనీ 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే మందుల సామేల్ పై అసత్య ఆరోపణలు మానుకోవాలని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాo క ఎమ్మెల్యే మందుల సామేల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక కొంతమంది నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. మందుల సామేల్ ఒక రైతు కుటుంబంలో జన్మించి, 40 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని తెలంగాణ ఉద్యమానికి పోరాడిన వ్యక్తి సామెల్ అని అన్నారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చి వారికి ఎలాంటి ఆదాయం లేకున్నా తుంగతుర్తి నియోజకవర్గం లో ప్రజలందరూ విశ్వాసంతో, నమ్మకంతో ఎమ్మెల్యే సామెల్ కు51 వేల మెజార్టీతో ప్రజలందరూ గెలిపించారని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికిఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజార్టీ రాలేదని అలాంటి వారిపైనే తిరుమలగిరి మండల కొంతమందినాయకులు విమర్శలు చేయడం తగదని తస్మై జాగ్రత్త అని ఎమ్మెల్యేపైన విమర్శలు చేస్తే ఎమ్మార్పీఎస్, దళిత నాయకులు తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి