Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చోరీ తర్వాతా చీకట్లోనే బాల నరసింహస్వామి ఆలయం..! నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 08, 2026 09:46 PM

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
July 08, 2026 08:09 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రాష్ట్ర ఫోరం పిలుపు.. భువనగిరిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం

​* సూర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్. ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు

గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్‌ల హక్కులు, అధికారాల సాధన కోసం రానున్న రోజుల్లో ఐక్యంగా పోరాటాలు కొనసాగిస్తామని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర సమీపంలోని హోటల్ సంకల్పలో ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మందోళ్లగూడెం ఉపసర్పంచ్, ఫోరం జిల్లా అధ్యక్షుడు సూర్కంటి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు.​ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ మాట్లాడుతూ.. ఇటీవల జూన్ 25న నిర్వహించిన "హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రవ్యాప్త ఉపసర్పంచ్‌లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితోనే మున్ముందు హక్కుల సాధనకై కదలిరావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉపసర్పంచ్‌కు ఫోరం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మజ్జిగ నరేష్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటికం స్వప్న, దుస్సా కుమార్, జంపన్న, మట్ట శ్రీను, చిన్నం బాల్‌రాజు, జిల్లా నాయకులు దండ నరేష్, మహేష్, రాజు, ప్రవీణ్, అనిల్, స్వామి, హరీష్, ప్రదీప్, విజయ్, భాస్కర్ నాయక్, వీరన్న, మండల ఫోరం అధ్యక్షులు గొడటి సత్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News