ఉపసర్పంచ్ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
ఉపసర్పంచ్ల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
K.RAVI
* రాష్ట్ర ఫోరం పిలుపు.. భువనగిరిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం
* సూర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్. ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు
గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ల హక్కులు, అధికారాల సాధన కోసం రానున్న రోజుల్లో ఐక్యంగా పోరాటాలు కొనసాగిస్తామని ఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర సమీపంలోని హోటల్ సంకల్పలో ఉపసర్పంచ్ల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మందోళ్లగూడెం ఉపసర్పంచ్, ఫోరం జిల్లా అధ్యక్షుడు సూర్కంటి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ మాట్లాడుతూ.. ఇటీవల జూన్ 25న నిర్వహించిన "హలో ఉపసర్పంచ్ – చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రాష్ట్రవ్యాప్త ఉపసర్పంచ్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యక్రమం ఇచ్చిన స్ఫూర్తితోనే మున్ముందు హక్కుల సాధనకై కదలిరావాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉపసర్పంచ్కు ఫోరం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మజ్జిగ నరేష్, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటికం స్వప్న, దుస్సా కుమార్, జంపన్న, మట్ట శ్రీను, చిన్నం బాల్రాజు, జిల్లా నాయకులు దండ నరేష్, మహేష్, రాజు, ప్రవీణ్, అనిల్, స్వామి, హరీష్, ప్రదీప్, విజయ్, భాస్కర్ నాయక్, వీరన్న, మండల ఫోరం అధ్యక్షులు గొడటి సత్యం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి