రామన్నపేటలో వైఎస్సార్ జయంతి వేడుకలు.
రామన్నపేటలో వైఎస్సార్ జయంతి వేడుకలు.
Editor Desk
రామన్నపేట
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో వైఎస్సార్ చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, డీసీసీ సెక్రటరీ కొత్తపల్లి అబ్రహం కుమార్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్తో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి