యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సతీష్ గౌహతిని సీనియర్ జర్నలిస్ట్ మల్లేష్ తెలుసూరి, గౌడ చైతన్యం ఎడిటర్ పులిపలుపుల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండలంలోని శాంతి భద్రతలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై ఎస్సైతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్ గౌహతి మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి సంఘవిద్రోహ చర్యలకు పాల్పడకుండా చట్టాన్ని గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకమైన పోలీసింగ్ అందిస్తామని ఆయన తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి