Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో యువకుడి ఆత్మహత్య అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 09:18 PM

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి
24-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం మాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్లు స్వప్న, జమ్బేశ్వర్ మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాలతో ఆదాయం పెంచుకునే ఉపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం, సంఘాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, సీసీ సాయిలు, వీఓఏ రజిని, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రుణాలను సద్వినియోగం చేసుకుని ఆదాయం పెంచుకోవాలి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం మాయికోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు మండల సమాఖ్య సీఆర్పీ ట్రైనర్లు స్వప్న, జమ్బేశ్వర్ మాట్లాడుతూ మహిళలు క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవడం, రుణాలతో ఆదాయం పెంచుకునే ఉపాధి అవకాశాలను ఎంచుకోవడం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళా సంఘాలు పేదరిక నిర్మూలనతో పాటు కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తనవంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం, సంఘాల ద్వారా అందుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, సీసీ సాయిలు, వీఓఏ రజిని, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News