Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆలయ పునర్నిర్మాణానికి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ రూ.10,116 విరాళం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 08:13 PM

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి
23-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ జూకల్ శివారులోని శంకరంపేట మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్‌లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడంపై సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. హాస్టల్‌లో విద్యార్థులకు సరైన భోజనం, వసతులు కల్పించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కూడా హాస్టళ్లలో పలు సమస్యలు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.అధికారులు అన్ని హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని, వారికి మెరుగైన భోజనం, వసతులు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మృత విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు గణపతి, రాహుల్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి మృతికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలి

Article Image

నారాయణఖేడ్ జూకల్ శివారులోని శంకరంపేట మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్‌లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందడంపై సమగ్ర విచారణ చేపట్టి, విద్యార్థి మృతికి కారణమైన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు డిమాండ్ చేశారు. హాస్టల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. హాస్టల్‌లో విద్యార్థులకు సరైన భోజనం, వసతులు కల్పించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో కూడా హాస్టళ్లలో పలు సమస్యలు వచ్చినప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.అధికారులు అన్ని హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని, వారికి మెరుగైన భోజనం, వసతులు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మృత విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు గణపతి, రాహుల్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News