హెజోలో రియాక్టర్ పేలుడు ఘటనపై తీవ్ర ఆందోళన
దోతిగూడెంలోని హెజోలో ఫార్మా యూనిట్లో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందడం, పలువురు గాయపడటంపై తెలంగాణ హోమియోపతిక్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చౌటుప్పల్–భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని ఫార్మా, కెమికల్ పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా, పర్యావరణ ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక కాలుష్యం, ప్రజారోగ్యంపై దాని ప్రభావంపై ఇప్పటికే జూలై 10న టిఎస్ పిసీబి మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు, నేల నాణ్యతతో పాటు ప్రజారోగ్యంపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా, ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రాణాలు, కార్మికుల భద్రతకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి