Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలాజీ అనురాధ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 07:14 PM

గురుకులంలో చదువులా.. పనులా?

గురుకులంలో చదువులా.. పనులా?

గురుకులంలో చదువులా.. పనులా?
23-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారంటూ SFI ఆగ్రహం.


దామరచర్ల బీసీ బాలికల గురుకులంలో తనిఖీ.. కలెక్టర్ స్పందించాలని డిమాండ్

మిర్యాలగూడ: బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆరోపించింది. శ్రీనివాస్‌నగర్‌లోని దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం SFI నాయకులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా SFI నాయకుడు మూడవత్ జగన్‌నాయక్ మాట్లాడుతూ.. పాఠశాల గేటు వద్దకు వెళ్లే సరికి సుమారు 30 మంది విద్యార్థినులతో బయట టేబుళ్లు ఏర్పాటు చేసి చపాతీలు చేయిస్తున్న దృశ్యం కనిపించిందన్నారు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పిస్తే.. విద్యార్థినులతో వంట పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రతి ఆదివారం ఒక్కో తరగతి విద్యార్థినులతో పూరీల కోసం చపాతీలు చేయిస్తున్నారని, సుమారు 500 మంది విద్యార్థులకు సరిపడా ఆహారం తయారు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రిన్సిపాల్, బీసీ గురుకులాల RCO తమ పిల్లలతోనూ ఇలాగే పనులు చేయిస్తారా అని ప్రశ్నించారు. చదువుకోవడానికి వచ్చిన బాలికలను హోటల్‌లో పనిచేసే వారి మాదిరిగా మార్చడం దుర్మార్గమని విమర్శించారు.

దామరచర్ల గురుకులంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యపై వార్తలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యలపై బీసీ గురుకులాల సెక్రటరీ, జిల్లా RCOలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


బాలుర గురుకులంలో పూరీ బంద్‌పై ప్రశ్నలు.


నాగార్జున కళాశాలలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఆగస్టు 15న లడ్డూలు ఇచ్చారని, అనంతరం ఆదివారం ఉదయం విద్యార్థులకు పూరీ టిఫిన్ ఇవ్వలేదని SFI నాయకులు ఆరోపించారు. పూరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించగా.. మెస్ ఛార్జీలు సరిపోవడం లేదని, RCO సూచనల మేరకు ఆదివారం ఉదయం పూరీ బంద్ చేసినట్లు సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాలోని బీసీ గురుకులాల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న జిల్లా RCOను వెంటనే తొలగించాలని జగన్‌నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా బలమైన సమరశీల పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో SFI నాయకులు ఝాన్సీ, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గురుకులంలో చదువులా.. పనులా?

Article Image

విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారంటూ SFI ఆగ్రహం.


దామరచర్ల బీసీ బాలికల గురుకులంలో తనిఖీ.. కలెక్టర్ స్పందించాలని డిమాండ్

మిర్యాలగూడ: బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆరోపించింది. శ్రీనివాస్‌నగర్‌లోని దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం SFI నాయకులు సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా SFI నాయకుడు మూడవత్ జగన్‌నాయక్ మాట్లాడుతూ.. పాఠశాల గేటు వద్దకు వెళ్లే సరికి సుమారు 30 మంది విద్యార్థినులతో బయట టేబుళ్లు ఏర్పాటు చేసి చపాతీలు చేయిస్తున్న దృశ్యం కనిపించిందన్నారు. ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులంలో చేర్పిస్తే.. విద్యార్థినులతో వంట పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు.

ప్రతి ఆదివారం ఒక్కో తరగతి విద్యార్థినులతో పూరీల కోసం చపాతీలు చేయిస్తున్నారని, సుమారు 500 మంది విద్యార్థులకు సరిపడా ఆహారం తయారు చేయాల్సి వస్తోందని ఆరోపించారు. ప్రిన్సిపాల్, బీసీ గురుకులాల RCO తమ పిల్లలతోనూ ఇలాగే పనులు చేయిస్తారా అని ప్రశ్నించారు. చదువుకోవడానికి వచ్చిన బాలికలను హోటల్‌లో పనిచేసే వారి మాదిరిగా మార్చడం దుర్మార్గమని విమర్శించారు.

దామరచర్ల గురుకులంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సమస్యపై వార్తలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల సమస్యలపై బీసీ గురుకులాల సెక్రటరీ, జిల్లా RCOలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వెంటనే నల్లగొండ జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


బాలుర గురుకులంలో పూరీ బంద్‌పై ప్రశ్నలు.


నాగార్జున కళాశాలలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఆగస్టు 15న లడ్డూలు ఇచ్చారని, అనంతరం ఆదివారం ఉదయం విద్యార్థులకు పూరీ టిఫిన్ ఇవ్వలేదని SFI నాయకులు ఆరోపించారు. పూరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించగా.. మెస్ ఛార్జీలు సరిపోవడం లేదని, RCO సూచనల మేరకు ఆదివారం ఉదయం పూరీ బంద్ చేసినట్లు సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాలోని బీసీ గురుకులాల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న జిల్లా RCOను వెంటనే తొలగించాలని జగన్‌నాయక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా బలమైన సమరశీల పోరాటాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో SFI నాయకులు ఝాన్సీ, వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News