సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఏళ్లుగా హామీలకే పరిమితమైన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్. దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది వాహనాలు ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారి అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి, పనులను ప్రారంభించాలని హెచ్. దాస్ కోరారు.
కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:
కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:
Krishna
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఏళ్లుగా హామీలకే పరిమితమైన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్. దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది వాహనాలు ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారి అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి, పనులను ప్రారంభించాలని హెచ్. దాస్ కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి