Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 11, 2026 09:25 PM

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:
11-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఏళ్లుగా హామీలకే పరిమితమైన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్. దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది వాహనాలు ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారి అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి, పనులను ప్రారంభించాలని హెచ్. దాస్ కోరారు.

Sthanikam

కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలి:

Article Image

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో ఏళ్లుగా హామీలకే పరిమితమైన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి హెచ్. దాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంగ్టి మండల కేంద్రం కావడంతో ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది వాహనాలు ప్రధాన రహదారి గుండా రాకపోకలు సాగిస్తున్నాయని, దీంతో పట్టణంలో వాహనాల రద్దీ పెరిగి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన రహదారి కూడా అధ్వానంగా మారి అనేక చోట్ల గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కంగ్టిలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎన్నో ఏళ్లుగా హామీలు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, సులభమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రజల చిరకాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా తక్షణమే స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి, పనులను ప్రారంభించాలని హెచ్. దాస్ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News