రామన్నపేట: మండలంలోని ఇంద్రపాలనగరంలో ఉన్న ఓ రైస్ మిల్లుపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
2023 సంవత్సరం నుంచి మిల్లు పేరు మార్చడం, సీఎంఆర్ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలు, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గత మూడేళ్లకు సంబంధించిన రికార్డులు, స్టాక్ నిల్వలు, లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అలాగే సీఎంఆర్ బియ్యం వ్యవహారంలో అప్పట్లో విధులు నిర్వహించిన సంబంధిత అధికారుల పాత్రపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ సోదాలు పూర్తయిన అనంతరం అక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి